ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి ఆత్మహత్య

ఖమ్మం, సెప్టెంబరు 11 : సత్తుపల్లి మండలం గంగారం సాయి స్ఫూర్తి ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థి లక్ష్మీసాయి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతదేహంతో తల్లిదండ్రులు, 200 మంది స్థానికులు గంగారం గ్రామానికి బయలుదేరారు. దీంతో స్థానికులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.