ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు కొత్త సిఇవో
ముంబై,జనవరి24(జనంసాక్షి): దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కొత్త సీఈవోను ఎంపిక చేసింది. రోనోజాయ్ దత్తాని సీఈవోగా నియమించామని కంపెనీ గురువారం ప్రకటించింది. అయిదేళ్ల పాటు ఆయన పదవిలో ఉంటారని వెల్లడించింది. అలాగే చైర్మన్గా మేలవీటిల్ దామోదరన్ నియామకాన్ని ఆమోదించింది. ఈ రెండు నియామకాలు జనవరి 24 నుంచి అమలులోకి వచ్చాయని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.కాగా యునైటెడ్ ఎయిర్లైన్స్ ఎ గ్జిక్యూటివ్గా, ఎయిర్ సహారా ప్రెసిడెంట్ పనిచేసిన దత్తా ఇటీవల ఇండిగో సంస్థలో ప్రిన్సిపల్ కన్స్టలెంట్గా జాయిన్ ?అయ్యారు. అయితే దత్తాకు సీఈవో పదవి కట్టబెట్టనున్నారనే అంచనాల నేపథ్యంలో గత నెలలో అప్పటి సీఈవో గ్రెగ్ టేలర? రాజీనామా చేశారని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.