ఇంటర్ పరీక్షల రాష్ట్ర టాపర్లకు అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సన్మానం

వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్లో  రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులకు అఖిలపక్ష  ఐక్యవేదిక నాయకులు వారి వారి కాలేజీలకు వెళ్లి ఘనంగా సన్మానించారు. ముందుగా స్కాలర్స్ కాలేజ్ కి వెళ్లి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ బై పీ సీ లో 990 మార్కులు సాధించిన మేఘన కు, ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 437 మార్కులతో సాధించిన మహితకు మిగతా ర్యాంకర్లకు సన్మానం చేశారు. జాగృతి కాలేజీలో 436 మార్కులతో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించిన వైష్ణవి కి, మూడవ ర్యాంకు సాధించిన నందిని తో పాటు ఇతర ర్యాంకర్లను సన్మానించిన తర్వాత అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ వస్తున్న మేము  విద్యార్థులు మనోధైర్యాన్ని నింపే విధంగా సన్మానాలు చేస్తూ వస్తున్నాము. ఈరోజు అందుబాటులో ఉన్న టాప్ ర్యాంకులు సాధించిన  విద్యార్థులకు  సన్మానం చేయడం జరిగింది.రేపు ఎల్లుండి కూడా మిగతా రాష్ట్ర, జిల్లా, పట్టణ,ర్యాంకర్లకు అఖిలపక్ష ఐక్యవేదిక తరపున సన్మానం చేయడం జరుగుతుందని అలాగే గవర్నమెంట్ కళాశాలలో చదివి ఉత్తీర్ణులైన అత్యధిక మార్కులు సాధించిన వారికి కూడా సన్మానం చేసి ప్రోత్సహించడం జరుగుతుందని ఐక్యవేదిక  నాయకులు  సతీష్ యాదవ్ చిరంజీవి,వెంకటేష్,రమేష్ వైఎస్ఆర్ సతీషు, తెలిపారు ఈ సన్మానం లో అధ్యాపక బృందం కూడా పాల్గొన్నరు.