ఇంటిపైకప్పు కూలి నలుగురు మృతి

మృతుల్లో ముగ్గురు చిన్నారులు, తల్లి
బెంగళూరు,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో రామజోగి హళ్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. చిన్నారుల తల్లి నాగరత్నమ్మ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.