*ఇందిరానగర్ లో కార్పొరేటర్ విస్తృత పర్యటన*

నాచారం(జనంసాక్షి): ఎంటమాలజీ , ఇంజనీరింగ్ శానిటేషన్ , జలమండలి అధికారులతో కలిసి కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ఇందిరా నగర్ లో పాదయాత్ర నిర్వహించారు. ప్రధానంగా హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువులోకి వచ్చి చేరిన చెత్త తొలగింపు పనులు పర్యవేక్షించారు. అలాగే డ్రోన్ సహాయంతో గుర్రపు డెక్క పై హేర్భిసైడ్ ద్రావణం పిచికారి పనులు చేయించారు. ఇందిరా నగర్ లో ఉన్న మంచినీటి , డ్రైనేజీ సమస్యలను అధికారులకు తక్షణమే పరిష్కరించాలని సూచించడం జరిగింది.
ఇందిరానగర్ లో వర్షం నీటి కొరకు ఏర్పాటు చేసిన మ్యాన్ హాల్ లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించడం జరిగింది.
ఇంద్రనగర్లో శానిటేషన్ సక్రమంగా చేయట్లేదని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శానిటేషన్ సిబ్బందిపై కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ లింగారావు, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రమేష్,  జలమండలి మేనేజర్ సాయిబాబా ,వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ,టిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, కట్ట బుచ్చన్న గౌడ్, ఖలీల్ ,వాసు ,సాయి జెన్ శేఖర్ ,ఎస్.ఎఫ్.ఏ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.