ఇంద్రవెల్లి సభతో టిఆర్‌ఎస్‌లో గుబులు

రేవంత్‌ భాష కేసిఆర్‌ భాషొకటేనన్న మల్లు
హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఇంద్రవెళ్లి సభ గనవిజయంతో టీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో దడ పుట్టిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి పేర్కొన్నారు. దళిత గిరిజన దండోరాతో కలుగులో ఉన్న నాయకులంతా బయటకు వచ్చి అరుస్తున్నారన్నారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడిన బాష గురించి వక్ర భాష్యాలు చెబుతున్నారని అన్నారు. అయితే ఆయన మాట్లాడిన భాష కొత్తగా వచ్చింది కాదని.. గత కొన్నేళ్లుగా కేసీఆర్‌ మాట్లాడిన బాషనే ఇదని అన్నారు. ప్రజాస్వామ్యంలో మూల సూత్రం తప్పులు జరిగితే క్షమాపణ కోరడమని.. అది తాము ఎప్పుడో చేశామన్నారు. మంత్రులు రేవంత్‌ రెడ్డి పైన చేసిన కామెంట్స్‌పై క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకొని టీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తోందన్నారు. దళిత, గిరిజనుల కోసం కాంగ్రెస్‌ పోరాటం ఆగదని మల్లు రవి పేర్కొన్నారు. వారిని ఏకం చేస్తామని, హక్కుల కోసం నినదిస్తామని అన్నారు.