ఇది పనికిమాలిన సమావేశం : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం తన నాటకాన్ని కొనసాగిస్తోందని తెరాస అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష భేటీపై తమకు సంతృప్తి లేదని.. ఇది పనికిమాలిన సమావేశమని పేర్కొన్నారు. అన్ని పార్టీలు మళ్లీ పాత పాటే పాడయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలని కోరారు. కాంగ్రెస్‌ నేతలకు చీము, నెత్తురు ఉంటే పార్టీ నుంచి బయలకు రావాలని సవాలు విసిరారు.