ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరి మృతి

ప్రకాశం:ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో చోటుచేసుకుంది.ఎంఎస్‌ ఆర్‌ పరిశ్రమ వద్ద ఇనుపచువ్వలతో వెళ్తున్న లారీ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో ఇనుపచువ్వలు గుచ్చుకోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.