ఇన్ఫోసిస్‌పై తాజాగా మరో 582 కోట్ల పన్ను భారం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆదాయపనున్న శాఖ ఇన్ఫోసిన్‌పై తాజాగా 2009 సంవత్సరానికి గాను రూ. 582 కోట్ల ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీస్‌ పంపించింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిన్‌ 2005 నుంచి నాలుగు సంవత్సరాలకు సంబంధించి 1,175 కోట్ల అదనపు ఆదాయపన్ను డిమాండ్‌పై న్యాయస్థానంలో ప్రశ్నిస్తోంది. తాజా డిమాండ్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది.