ఇరానీ ట్రోఫీలో సచిన్‌ శతకం

ముంబయి: ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్‌ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ (108 బ్యాటింగ్‌ 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించాడు. ఫన్‌క్లాస్‌ కెరీర్‌లో సచిన్‌కిది శతకం. దీంతో ముంబయి జట్లు రెస్టాన్‌ ఇండియా సాధించిన భారీ స్కోరుకు ధీటైన జవాబిస్తోంది. కడపటి వార్తలందే సమయానికి ముంబయి ఆరు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. సచిన్‌తో పాటు చవాన్‌ (40 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. రెస్టాన్‌ ఇండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 526 పరుగులు భారీ స్కోరు సాధించిన సంగతి తెలిసిందే.