ఇలాభట్కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ప్రదానం
న్యూఢిల్లీ:ప్రముఖ సంఘసేవకురాలు ఇలా రమేశ్ భట్కు ఈ రోజు 2011 సంవత్సరపు ఇందిరా గాంధీ శాంతి బహుమతి ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణఖ్ ముఖర్జీ చేతుల మీదుగా జరిగిన ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరయ్యారు. ఇలా భట్ మహిళల స్వావలంబనకు తోడ్పడే సేవ (సెల్ఫ్ ఎంప్లాయ్డ్ విమెన్స్ అసోసియేషన్ )అనే స్వచ్చంద సంస్థను నెలకొల్పారు.
I