ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడికి గుండెపోటు

-జిల్లా ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు
– ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన వైద్యులు
ఖమ్మం, జూన్‌22(జ‌నం సాక్షి) : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు శుక్రవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గుమ్మడి నర్సయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సీపీఐ(ఎంఎల్‌ – న్యూడెమోక్రసీ) పార్టీ నుంచి 1983లో ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుమ్మడి నరసయ్య ఇల్లందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.