ఇసాక్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు

గద్వాల జూలై 19 (జనం సాక్షి )ఆర్ సి.
జోగులాంబ గద్వాల జిల్లాలోని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్ ఆధ్వర్యంలో డీ సి సి అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి 54 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది.ఈ కార్యక్రమంలో 11వ వార్డు ప్రజలు,కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలు అభిమానులు నాయకులు, రైతులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరడం జరిగింది.తన వెంట ఉన్న రైతులకు బోనస్ కింద తన వంతు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలియజేసి 150 మందికి 15 లక్షల రూపాయలు అందజేశారు. రైతులు నష్ట పోరాదని ఎక్కువ పంటలు పండించాలని వారి వెంట ఎల్లప్పుడూ నా సహకారం ఉంటుందని భరోసా కలిగించారు. ఈ కార్యక్రమంలో ఇసాక్ , శంకర్ ఇలియాస్ జమాల్ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు