ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు
నర్సాపూర్, . ( జనం సాక్షి ) :
స్నేహితులతో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి గల్లంతైన సంఘటన నర్సాపూర్ మండలంలోని సీతారాంపూర్ గ్రామ చెరువు వద్ద బుధవారం జరిగింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టగా మృత దేహం లభ్యం కాలేదు.దీంతోష గురువారం ఉదయం కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.గజ ఈతగాళ్ళ సహాయంతో సాయంత్రం వరకు వెతికిన బాబు ఆచూకీ లభించలేదు.రెండు రోజులుగా వెతికిన మృత దేహం లభించకపోవడంతో కుటుంబీకుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.