ఈనెల 19న జిల్లా ఆసుపత్రిలో ఉచిత కంటి చికిత్స శిబిరం. -ఆప్తాలమిక్ అధికారి బి.శివారెడ్డి.

 

 

 

 

 

 

 

 

జిల్లా ఆందత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈనెల 19న సోమవారం ఉదయం 10 గంటలకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆప్తాలమిక్ అధికారి బి.శివారెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి, క్యాటరాక్ట్ పొరగల వారినీ ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఏనుగొండలోని లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి పంపించి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోగులకు జిల్లా ఆస్పత్రిలో ఉచితంగా రక్త పరీక్షలు, సాధారణ పరీక్షలు, కరోణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, లేదా రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీని వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440454284 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.