ఈనెల 30వ తేదీన జరిగే అలై బలై కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

మక్తల్ అక్టోబర్ 10 (జనంసాక్షి) టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 30వ తేదీన మాదిగల
అలై బలై కార్యక్రమం ఉంటుందని మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డమీద గోపాలకృష్ణ, టిఎమ్ఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిసనోల్ల బాలరాజ్ మాదిగ తెలిపారు. నారాయణపేట జిల్లా అధ్యక్షులు సిరిపురం ఆంజనేయులు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా
మక్తల్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డమీద గోపాలకృష్ణ, టిఎమ్ఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిసనోల్ల బాలరాజ్ మాదిగ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ న మాదిగల అలైబలై  కార్యక్రమం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ హాల్లో మాదిగల అలైబాలై కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పెడమర్తి రవి మాదిగ, టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి మాదిగ ప్రజాప్రతినిధులు హాజరవుతారు. కావున తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి మాదిగలు మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో తరలి వచ్చి మాదిగల అలైబలై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు బోర్ర సురేష్, టిఎమ్ఆర్పిఎస్ జిల్లా కోశాధికారి పంచలింగాల ఆంజనేయులు, మక్తల్ నియోజకవర్గం అధ్యక్షులు కర్రె అంజనేయులు మాదిగ, జె అయ్యప్ప, కర్రి అశోక్, పవన్ కళ్యాణ్, వేణు, మన్యం, సినీ కళాకారుడు మహేష్ కుమార్, పరశురాం తదితరులు పాల్గొన్నారు