ఈవీఎం గోదామును సందర్శించి ఈ.వి.ఎం.లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 14 జనం సాక్షి:
ఈ.వి.ఎం.ల భద్రత, పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ త్రై మాసం తనిఖీలో భాగంగా కొల్లాపూర్ చౌరస్తా నందు క్రొత్త కలెక్టరేట్ భవన సముదాయం సమీపంలో గల ఈ వీ ఎం గోదామును సందర్శించి పరిశీలించారు.
స్ట్రాంగ్ రూమ్ సీల్ ను పరిశిలించిన అనంతరం, సీల్ ను తీసి గోదాము తెరిచి లోపల భద్రపరిచిన ఈ.వి.ఎం.లను పరిశీలించారు.
 సి సి కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలనీ అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో కాంగ్రెస్, టిఆర్ఎస్ వైయస్సార్సీపి పార్టీల ప్రతినిధులు డేవిడ్, మహమ్మద్ హుస్సేన్ శ్రీనివాసులు,
ఈ ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, కలెక్టర్ పి ఎస్ ఖాజా మైనుద్దీన్, డిప్యూటీ తహశీల్దార్ ఇక్బాల్, సీనియర్ అసిస్టెంట్ ఆబేద్ అలీ, టెక్నికల్ ఆపరేటర్ అశోక్ ,ఖాజా తదితరులు పాల్గొన్నారు.
Attachments area