ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
నాచారం(జనంసాక్షి): వెంకట్ రెడ్డి కుమారుడు కాశ్విక్ పుట్టిన రోజు సందర్భంగా మీర్పెట్ హెచ్ బీ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం ప్రభుదాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని మరియు తల్లిదండ్రులకు, గురువులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకు రావాలని అన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కాశ్వీక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం సొసైటీ అద్యక్షులు తూటే విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే పద్దతిలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఎంచుకుని విద్యార్థులకు నోట్ బుక్స్, పరీక్ష సామగ్రి పరీక్ష రుసుము లాంటివి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు జాకబ్ ప్రసాద్, దేవి, విజయ్, రాజేష్, శాంత కుమారి, అరుణ్ కుమార్, రేవతి, సౌజన్య స్థానిక నాయకులు భూపతి అశోక్ తదితరులు పాల్గొన్నారు.