ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి   

     * సీఎంఆర్ ఆసుపత్రి వైద్య సేవలను అభినందించిన మెదక్ జడ్పీ చైర్పర్సన్
తూప్రాన్ (జనం సాక్షి) ఆగస్టు 2:: కార్పొరేట్ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాలలో ఉచితంగా అందించే వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు ఆమె దత్తత గ్రామం గౌతోజిగూడ లో సీఎంఆర్ మల్లారెడ్డి హాస్పిటల్ సురారం సంస్థ చెర్మెన్ డాక్టర్ భద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు ఎంపీపీ పురం నవనిత రవి సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్ లతో కలసి ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ ఈ వైద్య ని వినిగించుకోవాలని అన్నారు వర్ష కాలం లో ప్రతి ఇంటి దగ్గర పరిశుభ్రంగా మరియు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి అన్నారు అపరిశుభ్రంగా ఉన్నపుడు దోమలతో అనేక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరుసు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు గ్రామపంచాయతీ అధికారులు వీధులలో దోమల మందు ట్యాంకులలో క్లోరినేషన్ చేయాలని ఆమె సూచించారు ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న అక్కడ మొక్కలు నాటాలని ఎన్ని మొక్కలు అయినా ఇవ్వడానికి గ్రామ నర్సులు సిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు గౌతమి కూడా గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు గ్రామ అభివృద్ధికి ఎన్ని నిధులైన ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు  తను దత్తత గ్రామనికి  వచ్చిన మల్లారెడ్డి హాస్పిటల్ వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి రెడ్డి సీఎంఆర్ ఆసుపత్రి డాక్టర్ల్ శ్వేతా, ,రుచిత.  ఏఎన్ఎంలు  అరుణ సంధ్య. జయంతి. మార్కెటింగ్ డైరెక్టర్ మాహెబుబ్ ఏపీవో ఆదినారాయణ ఏ పి ఎం పెంటగౌడ్ సిసి శోభారాణి వార్డు సభ్యులు పెంటమ్మా భవాని శ్రీనివాస్ పద్మ అంజనేయులు టి ఏ శ్రీనివాస్ సీఏ ఉపాధిహామీ మెటు నాయకులు నర్సింలు . ఆంజనేయులు ఆనంద్.మైసయ్య. తదితరులు పాల్గొన్నారు