ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ

పలువురిని ఆకట్టుకున్న విద్యార్థినిలు నృత్యం
_దారి పొడుగునా రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు
ఝరాసంగం ఆగస్టు 13( జనంసాక్షి)
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఝరాసంగం మండల కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. మహాత్మా జ్యోతి రావు పులే పాఠశాల విద్యార్థినిలు చేసిన డ్యాన్స్ ప్రోగం పలువురిని ఆకట్టుకుంది. జాతీయ పతాకం తో భారీ ర్యాలీ ప్రారంభమైన ర్యాలీ రోడ్డు మీదుగా రైతు వేదిక వరకు కొనసాగింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల విశిష్టతను చాటేలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్చందంగా హాజరై ఫ్రీడం ర్యాలీలో భాగస్వాములయ్యారు.
గుండెల నిండా దేశ భక్తిని నింపుకుని విద్యార్థులు, యువతీ యువకులు మొదలు వృద్దుల వరకు కదంకదం కలుపుతూ ర్యాలీలో పాల్గొనడం జాతీయ సమైక్యతకు అద్దంపట్టింది.
మండలంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్ సి సి, ఎన్ఎస్ఎస్ క్యాడెట్ లు సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, అధికారులు త్రివర్ణ పతాకాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొని జాతీయ సమైక్యత భావాన్ని చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుజాత, తాసిల్దార్ తారా సింగ్ ఎస్సై రాజేందర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ మజీద్ తెరాస మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి సర్పంచ్ పురం అధ్యక్షుడు జగదీశ్వర్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు