ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించండి

కాంగ్రెస్ పార్టీ మండలధ్యక్షుడు పండిత్ రావు
జనం సాక్షి,
మండల కేంద్రంలో టిపిసిసి అధ్యక్షులు మరియు డిసిసి అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ ఎక్స్ ఎమ్మెల్యే పిలుపుమేరకు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పండిత్ రావు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పింఛన్దారులకు నెలసగం గడుస్తున్న ఇంతవరకు వారికి జీతాలు, పెన్షన్స్ విడుదల చేయలేదని జీతాలు చెల్లించడంలో తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అదేవిధంగా బంగారు తెలంగాణలో కనీసం ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్ దారులకు నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని ఈ అసమార్థ ప్రభుత్వాన్ని ధనిక రాష్ట్రమని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఉద్యోగస్తులకు ఈనెల సగం తేదీ కావస్తున్న వారికి జీతాలు వేయలేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ నర్మదా, టౌన్ ప్రెసిడెంట్ పిట్టల రమేష్, వైస్ ప్రెసిడెంట్ రఫీ, యూత్ అధ్యక్షుడు ఖయ్యూం ఖాన్, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, సీనియర్ నాయకులు చంద్రయ్య, అంజయ్య, రవి, దశరథం, శివశంకర్, గఫర్, సత్యనారాయణ, భీమయ్య, ఆలూరి మల్లేష్, కిష్టం పల్లి సర్పంచ్ జంగయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.