ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ పోటీ

నూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరుపున అభ్యర్థిని బరిలో నిలపాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. భాజపా అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ నివాసంలో ఆపార్టీ అగ్రనేతలు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఎన్డీఏ అభ్యద్థిగా భాజపా సీనియర్‌ నేత అనంత్‌కుమార్‌ను నిలబెట్టాలని భావించినప్పటికీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఈనెల 16న ఎన్టీఏ భాగస్వామ్య పక్షాలతో మరోమారు చర్చించి అభ్యర్థి ఎంపికపై తుదినిర్ణయానికి వచ్చే అవకాశముంది.