ఉపాధిహామి పనులను పరిశీలించిన దిశ కమిటీ 

ఖమ్మం,మే21(జ‌నం సాక్షి): కల్లూరు ఖాన్‌ ఖాన్‌ పేటలోని జువ్వలచెర్వు, గోపాలకుంట నందు గల కుమ్మరికుంటవచ్చనాయక్‌ తాండమల్లయ్యకుంట లోని ఉపాధిహామి పనులను పరిశీలించి, కూలీలకు గిట్టుబాటు దర అందుతుందో లేదో తెలుసుకున్నారు. కూలీలకు  ఓఆర్‌ఆర్‌ ప్యాకెట్‌ లు, బిస్కెట్‌ లు పంపిణి చేశారు. పుల్లయ్య బంజరు లోవిద్యర్ధి పుప్పాల నర్మద పై చదువులకు ఆర్ధిక సహాయము అందించి తరువాత కూడా చెదువులకు సహాయము చేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో టి ఆర్‌ యస్‌ పార్టీ నాయకులు డాక్టర్‌.లక్కినేని రఘు కీసర వెంకటేశ్వరరెడ్డి,  భరోత్‌ రాము,జగ్గవరపు సంజీవరెడ్డి, రామిశెట్టి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
—-