ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి : బీజేవైఎం. వారి కుటుంబాలతో కలిసి ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తాం

 
(జనంసాక్షి) జూలై 18 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలం ప్రభుత్వం తొలగించిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోడేరు  ఎంపిడిఓ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఎం పి ఓ శ్రావన్ కు  వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేవైయం జిల్లా ఉపాధ్యక్షులు పుట్టా భాను చందర్  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించాలి.ప్రతి పేద కుటుంబానికి సంవత్సరంలో కనీసం 100 రోజులు ప్రభుత్వమే పని కల్పించాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం.ఈ పథకం ద్వారా దేశంలోని పేదలందరికి పని కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన.ఇటువంటి పథకానికి గత 14 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారు.ఇదిలావుండగా మరోపక్క వారి మనుగడకే ప్రమాదం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన 47,79 జీఓ లను వ్యతిరేకిస్తూ ఫీల్డ్ ఆఫీసర్లు 2020లో ఉద్యమం చేపట్టారు.ఆ సమస్యలను పరిష్కరించకపోగా వారందరిని విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీటిపై వారు కోర్టుకెళితే వారిని విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది..అయినా ప్రభుత్వం స్పందించకపోగా బీజేవైయం చేసిన పోరాటాలకు తలొగ్గి గత మార్చి 15వ తేదీనా నిండు అసెంబ్లీ సాక్షిగా వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారని వారు అన్నారు.ప్రకటించి 115 రోజులు గడిచినా వాటిపై స్పందించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం రోజు  బీజేవైయం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించి వినతిపత్రం అందజేయడం జరిగింది.
వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో వారి కుటుంబాలతో కలిసి ఉద్యమకార్యాచరణ చేపడుతామని హెచ్చరించారు.ఈ
కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పరశురాం, మండల ప్రధాన కార్యదర్శి బాలపీర్ యాదవ్, రామకృష్ణ, మహేష్, శివ, మల్లేష్, శ్రీకాంత్, గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area