ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం

వేమనపల్లి,అక్టోబర్ 12 (జనంసాక్షి)

గ్రామీణ ఉపాధిహామీ పథకంపై బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో అల్లూరి లక్ష్మయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు రికార్డ్ లు,హరితహరం కూలీల పనిదినాల కల్పనపై,
ఉపాధివేతనం సక్రమంగా అమలుచేయడానికి చర్యలు, కొలతల నిర్వహణ,ఉపాధి కూలీల పెంపుదల, పనికల్పనపై గ్రామ పంచాయతీల వారీగా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ సత్య ప్రసాద్, ఈసి మధుకర్,సాంకేతిక సహాయకులు,క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.