ఉపాధ్యాయులను సన్మానించిన జిల్లా విద్యాశాఖ..

ధరూర్ సెప్టెంబరు 05 (జనంసాక్షి):- డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎం.ఎ.ఎల్.డి డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ‌
ముఖ్య అతిథులుగా జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత,జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరై ప్రారంభించారు.. ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా విద్యా అధికారి సిరాజువుద్దీన్ శాలువా, మెమొంటో అందజేసి సత్కరించారు..ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.