ఉపాధ్యాయులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

మక్తల్ అక్టోబర్ 14 (జనంసాక్షి)
మక్తల్ హైదరాబాద్, రంగారెడ్డి,
మహబూబ్ నగర్,
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం ఉపాధ్యాయులు తమ ఓటును నమోదు చేసుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, మక్తల్ మండల అధ్యక్షులు రవీందర్ కోరారు. శుక్రవారం మక్తల్ మండలంలోని గుడిగండ్ల, జక్లేర్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఓటు నమోదు కోసం ఫామ్ 19 అందించి ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు.
ఓటు నమోదు ప్రక్రియ నవంబర్ 7వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్, లక్ష్మణ్ వెంకట్రాములు, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు
Attachments area