ఎటిఎంలో డబ్బు దోచుకున్న బ్యాంక్‌ మేనేజర్‌

అరెస్ట్‌ చేసిన పోలీసులు
ముజప్ఫర్‌ నగర్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  సాక్షాత్తూ బ్యాంకు మేనేజరే ఏటీఎంలోని డబ్బును చోరీ చేసిన ఘటన యూపీలోని బంతిఖేడా గ్రామంలో వెలుగుచూసింది. బంతిఖేడా గ్రామంలో రాబిన్‌ బన్సాల్‌ ఓవర్‌ సీస్‌ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్నాడు. మేనేజరు రాబిన్‌ షావ్లిూ గ్రామంలోని బ్యాంచి ఏటీఎంలో ఉన్న ఏటీఎంలో చేతన్‌ అనే మరో నిందితుడితో కలిసి రూ.18 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. ఏటీఎం పాస్‌ వర్డ్‌ తెలిసిన బన్సాల్‌ దాని సాయంతోనే తెరచి డబ్బుతో ఉడాయించాడు. పరారీలో ఉన్న బ్యాంకు మేనేజరు రాబిన్‌ ను అరెస్టు చేశామని ఎస్పీ దినేష్‌ కుమార్‌ చెప్పారు.