ఎదుల్లాపూర్ ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే మదన్ రెడ్డి

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, ఎంపీపీ
శివ్వంపేట జూలై 24 జనంసాక్షి :మండలంలోని ఎదుల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పోచమ్మ  తల్లి బోనాల ఉత్సవాలకు  నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ఎంపీపీ కల్లూరి హరికృష్ణతో కలిసి దేవాలయం లో అమ్మవారినీ దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దయవల్ల ఈ ఏడాది సకాలంలో సంవృద్ధి గా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండి అన్ని గ్రామాలలో రైతులు పంటలు సాగు చేశారని, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో,  ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎంపీపీ హరికృష్ణతో పాటు మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, అథితులనందరిని సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ కల్లూరి వెంకటేశ్, సునంద రెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి, చిన్నగొట్టిముక్ల సర్పంచ్ బాలమణి నరేందర్, మ్యాకల యాదిరెడ్డి, దంత వైద్యులు కల్లూరి సంతోష్, సోషల్ మీడియా ఇంచార్జీ పైనం సందీప్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Attachments area