ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ వద్ద మాల మహానాడు ధర్నా

హైదరాబాద్‌:మాలవహానాడు కార్యకర్తలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ ముందు ఆందోళనకు దిగారు.దళితుల ఐక్యతను దెబ్మతీస్తూ విభజించు,పాలించు సూత్రాన్ని చంద్రబాబు అమలుచేస్తున్నారని మాలమహనాడు రాష్ట్రప్రదాన కార్యదర్శి చెన్నయ్య ఆరోపించారు.ఎస్పీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనను వీడకపోతే రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు.అనంతరం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఆరెస్టు చేశారు.