ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న అధికారుల పదోన్నతుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న అధికారులకు పదోన్నతులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది.  ఈ సందర్భంగా ఎన్‌కౌంట్లపై సుప్రీం పలు వ్యాఖ్యలు చేసింది. మీరు చంపాలనుకున్న వ్యక్తులపై మావోయిస్టులుగా ముద్ర వేస్తారా? అని తీవ్ర వ్యాఖ్యాలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.