ఎపిసీడ్స్‌ ఉద్యోగి రాధాకృష్ణపై కేసు నమోదు

ఖమ్మం, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): ఎపిసీడ్స్‌ జూనియర్‌ అసిసెస్ట్‌ రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం పట్టణ మూడవ టౌన్‌ పోలీసులు తెలిపారు. నగదు నిధుల గోల్మాల్‌పై ఎపిసీడ్స్‌ కార్యాలయం జిల్లా మేనేజర్‌ మాదిరెడ్డి కొండల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. త్రిటౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.