ఎఫ్ఎం రేడియో శంకుస్థాపనలో తాపీపట్టిన సోనియా
రాయ్బరేలి, మార్చి 25 (జనంసాక్షి) :
ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సోమ వారం తాపీ మేస్త్రీ అవతారం ఎత్తారు. స్థానికంగా ఏర్పాటు చేయనున్న ఎఫ్ఎం రేడియో స్టేషన్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్వయంగా తాపీ పట్టి ఇటుకలు పేర్చి సిమెంట్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ, ప్రజల సర్వతో మూఖా భివృద్ధికి యూపీఏ ప్రభుత్వం పాటుపడు తుందని అన్నారు. ప్రజా శ్రేయస్సుకోసమే వివిధ పథకాలు ప్రవేశపెడ ు తున్నామని తెలిపారు. అనం తరం రాయ్ బరేలిలోని బచత్ భవన్లో నిర్వ హించిన జిల్లా విజిలెన్స్ కమిటీ సమా వేశంలో పాల్గొన్నారు. సొంత నియోజకవర్గ అధివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.