ఎమ్మెల్యే ఆదేశాలు బెఖతర్ పట్టించుకోని విద్యుత్ అధికారులు
మోమిన్ పేట ఆగస్టు 21 జనం సాక్షి
ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్ పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు మీతో నేను కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట మండలం వెల్చల్ గ్రామంలో జరిగిన సమావేశంలో గొల్ల బాయి దగ్గర రెండో విద్యుత్ స్తంభాలు వైరు నేలకొరిగిన ఈ విషయమును మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రెండు మూడు రోజుల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఏఈ అని ఆదేశించారు 15 రోజులు అవుతుంది అయినా విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం చూస్తే ఎమ్మెల్యే మాట పైన ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రాణాపాయ స్థితి నుండి రైతులను కాపాడాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతినిత్యం తమ పంట పొలాలకు పనుల నిమిత్తం వచ్చే రైతులు బిక్కు బిక్కు మంటూ ప్రాణభయంతో తమ ప్రథమ పనులను వదిలి పెట్టుకొని పొలాల లోకి రావడం మానేశారు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు రైతులు కోరుతున్నారు
