ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యం.

మాజీ మార్కెట్ చైర్మన్ నల్లగంటి వెంకటయ్య.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై21(జనంసాక్షి):
స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నియోజకవర్గంలో అభివృద్ధిని మరచిన గ్రామాలను కూడా అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోతున్నారని మాజీ మార్కెట్ చైర్మన్ నల్లగంటి వెంకటయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయన స్వంత డబ్బులతో నిరుపేదలకు వివాహాలు చేశారని అనంతరం కళ్యాణ లక్ష్మి వచ్చే విధంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో ఉన్న ఏ నాయకులు చేయని అభివృద్ధి సొంత డబ్బులతోనే గ్రామ గ్రామంలో స్మశాన వాటికలు డంపింగ్ యార్డులు ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నప్పటిక సొంత డబ్బులు వెచ్చించి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆయన అన్నారు.కానీ వండ్రు మట్టిని అమ్ముకున్నారని ప్రచారం చేయడం అసత్యమేనని అలాంటి పనులు చేసే అవకాశం కల్పించుకోడని అన్నారు.ఎం జె ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించి ఉచితంగా భోజన వసతితో కూడిన చదువును చెప్పించిన ఘనత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కే దక్కిందని అన్నారు.గతంలో ఉన్న నాయకులు ఎంతో అవినీతి మయం చేశారని నేడు చూస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఒక ఇంటికి పెద్ద కొడుకుగా ఒక అన్నకు తమ్మునిగా తమ్మునికి అన్నగా చెల్లెలికి అన్నగా ఉంటూ ఆపద వస్తే ఆదుకునే మనసున్న మహారాజు మర్రి జనార్దన్ రెడ్డి అని ఆయన కొనియాడారు. కొంత మంది కావాలని దుష్ప్రచారం చేస్తూ అవినీతి చేశాడని తప్పుడు మాటలు పలుకుతూ ఉన్నారని ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా ఖబర్దార్ సహించేది లేదని హెచ్చరించారు.
Attachments area