ఎమ్మెల్యే సుధీరన్న.. గట్లెట్లబొయ్యిండు

హైదరాబాద్ (జనంసాక్షి)

బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఓ ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్ వనస్థలిపురంలో ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించగా… భాజపా కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తదితరులతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిసి, తెదేపా అభిమానులకు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. పనామా సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు అడ్డుకున్న క్రమంలో.. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.