ఎమ్మెల్యే సొంత మండలంలో అంబులెన్సు దిక్కులేదు-బిఎస్పీ.

-బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి.కుమార్….

 

నాగర్ కర్నూల్ రూరల్:జులై 19(జనంసాక్షి)

బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ)ఆధ్వర్యంలో తిమ్మాజిపేట్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని,కస్తూర్భా గాంధీ పాఠశాలను సందర్శించడం జరిగింది.తదనంతరం తిమ్మాజిపేటలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ప్రెస్ మీటులో బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి.కుమార్ మాట్లాడుతూ,స్థానిక ఎమ్మెల్యే సొంత మండలం ఐన తిమ్మాజిపేటలో అంబులెన్సు సౌకర్యం లేకపోవడం దారుణం అని అన్నారు.30సంవత్సరాల క్రితం కట్టిన ప్రభుత్వ ఆసుపత్రి బిల్డింగ్ శిథిలావస్థకు చేరిందని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరూ డ్యూటీ డాక్టర్స్ ఉండాల్సిన చోటా,కేవలం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు.కస్తూర్బాగాంధీ పాఠశాలలో సరైన ఆటస్థలం,నీళ్ల మోటార్ సమస్య,కిటికీలు-తలుపులు లేకుండా ఉండటం,డే వాచ్ మెన్ పోస్ట్ ఖాళీగా ఉండటం,సీసీ కెమెరాల సమస్య ఇలా అనేక సమస్యలతో,కస్తూర్భా గాంధీ పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని విమర్శించారు.గుట్టలు తవ్వే స్థానిక ఎమ్మెల్యే,కస్తూర్భాగాంధీ పాఠశాల ఆవరణలో మరియు పాఠశాల ముందు మొర్రం పోయిస్తే నీళ్లు నిల్వకుండా ఉంటాయని తెలిపారు.రానున్న బహుజన రాజ్యంలో విద్యా,వైద్యానికి తొలి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే మరియు తెరాస వైపల్యాలను నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ కు తెలియజేసి,దోపిడీ పాలనను కూల్చి బహుజన రాజ్యం సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీరాజ్,ప్రధాన కార్యదర్శి శ్రీనువాసులు,ఉపాధ్యక్షులు పరుశరామ్,బిఎస్పీ తిమ్మాజిపేట్ మండల కన్వీనర్లు బి.రాజ్,శంకర్,నాయకులు సత్యం,రమేష్,కృష్ణ,అశోక్,మొగులాల్,బాలనాగులు,రాజ్,సాయికుమార్,జగదీష్,మల్లేష్,మహేష్,కురుమయ్య,సోషల్ మీడియా కన్వీనర్ రామ్,బీవీఫ్ జిల్లా అధ్యక్షులు చెన్నయ్యలు పాల్గొన్నారు.