ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించండి

 వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షులు సూగూరు వరప్రసాద్ రావు
పానుగల్ అక్టోబర్14, జనంసాక్షి
 మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్టియు టిఎస్ రాష్ట్ర శాఖ బలపరిచిన ఏమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిని గెలిపించాలని జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ రావు కోరారు.ఓటు వేసేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ పిఆర్టియు టిఎస్  మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటు నమోదు పత్రాలు పంపిణీ శుక్రవారం చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ రావు మాట్లాడుతూ పిఆర్టియు అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి గెలుపే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి మార్గమని, అతి త్వరలోనే ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు, బదిలీలు జరుగనున్నాయని, కాంట్రాక్ట్ జెల్ పోస్టులు రెగ్యులరైజేషన్ కాబోతున్నాయని అలాగే 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానం,కేజీబీవీ ఉపాధ్యాయులకు టైం స్కేల్ , వీటన్నింటినీ పరిష్కరించిన తర్వాతనే పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయండని అభ్యర్థిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బౌద్ధరెడ్డి,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రవిందర్ గౌడు,మండల అధ్యక్షులు జయంత్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బండి శ్రీను మరియు మండల కార్యవర్గ సభ్యులు మరియు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.
Attachments area