ఎమ్మెల్సీ కోటిరెడ్డి పిలుపుమేరకు గుర్రంపోడ్ మండలంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి

 

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 17 (జనంసాక్షి) న్యూస్ : ఎమ్మెల్సీ కోటిరెడ్డి పిలుపుమేరకు గుర్రంపోడ్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి బంగ్లాలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని దేశాన్ని వారి ఆధ్వర్యంలో పరిపాలన చేయాలని వారి విలువైన సేవలు ప్రజలకు రైతులకు అందాలని కేసిఆర్ సారధ్యంలో రాష్ట్రం ఇంకా పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుర్రంపోడ్ జడ్పిటిసి గాలి సరిత రవికుమార్, స్థానిక సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా, సర్పంచులు భాస్కర్, మదర్షా, విజయ్, లింగారెడ్డి, రామలింగం, శ్రీనివాస్ రెడ్డి, దస్రు నాయక్, కృష్ణ ప్రసాద్, నరసింహ రావు, లింగయ్య, నగేష్, కిరణ్, అర్జున్ రావు, ఆర్ఎస్, శ్రీనివాస చారి, మాజీ సర్పంచ్ ఉమర్, చక్రపాణి, జాల యాదయ్య, శక్రు నాయక్, కాశీం, సైది మియా, జాకీర్, జగదీష్, భరత్, కుమార్, వేణు, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు