ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కరపత్రాన్ని విడుదల చేసిన ఎమ్మేల్యే మాణిక్ రావు
జహీరాబాద్ ఆగస్టు 21 (జనంసాక్షి) ఈనెల 24 న హైదరాబాదులో తెలంగాణ ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం కోసం ఏర్పాటు చేసిన కరపత్రాలను ఎమ్మెల్యే మాణిక్ రావు విడుదల చేశారు ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పత్రికను విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల కులానికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రత్యేక భవనం నిర్మాణం కోసం స్థలము మరియు రెండు కోట్ల నిధులను మంజూరు చేయడం సంతోషకరమన్నారు కావున భవన శంకుస్థాపన కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఎరుకల ఎరుకల కులానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మండలపురం గోపాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కృష్ణ
యూత్ అధ్యక్షులు యాదయ్య కోశాధికారి తుల్జారాం జహీరాబాద్ తాలూకా ప్రధాన కార్యదర్శి మధుగొండ మహేష్,శివ జగదీష్. అజయ్.శీను ,తుల్జారామ్ ఎల్లన్న . రవి మరియు ఎరుకుల కులస్తులు పాల్గొన్నా