ఎరువుల దుకాణం తనిఖీ చేసిన కలెక్టర్.

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన కలెక్టర్.

నల్గొండ బ్యూరో, సెప్టెంబర్ 29. జనం సాక్షి.
కొండ మల్లే పల్లి మండల కేంద్రం లో లక్ష్మి వెంకటేశ్వర పర్టీలైజర్,సీడ్స్ దుకాణం ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు .యూరియా,కాంప్లెక్స్ ఎరువుల నిల్వ,అమ్మకాలు ఈ పాస్ యంత్రంలో నమోదు వివరాలు,దుకాణం ,గోదాం లో స్టాక్ పరిశీలించారు.ప్రస్తుతం యూరియా , కాంప్లెక్స్ ఎరువులు,పొటాష్ అందు బాటులో ఉన్నట్లు,యూరియా కు ఎటువంటి ఇబ్బంది లేదని దుకాణం యజమాని కలెక్టర్ కు వివరించారు.ఎరువులు యూరియా,కాంప్లెక్స్,పొటాష్ ఎంత రేటుకు అమ్ముతున్నారు అడిగి తెలుసుకున్నారు.వచ్చే యాసంగి సీజన్ కు కూడా ఎరువులు రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని సూచించారు.అమ్మకాలు జరిపిన వెంటనే ఆన్ లైన్ లో అప్డేట్ చేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం రైతు సేవా సహకార కేంద్రం తనిఖీ చేసి ఎరువులు స్టాక్,అమ్మకాలు పరిశీలించారు.రైతులకు అవసరమైన ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని సూచించారు.