ఎల్ఎస్బీసీకి అత్యంత ప్రాధాన్యం
` వీలైనంత త్వరగాపున:ప్రారంభించండి: మంత్రి ఉత్తమ్
` అత్యాధునిక సాంకేతికతతో ముందుకెళ్లాలి
` ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో ఎత్తిపోతలకు ఏటా రూ.750 కోట్లు ఖర్చవుతోంది
` అవసరమైన అనుమతులపై త్వరలో సీఎంతో భేటీ అవుతా
` మూడు దశాబ్దాల తర్వాత నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బదిలీలు
` నీటిపారుదశాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి సమీక్ష
హైదరాబాద్(జనంసాక్షి): ఎస్ఎల్బీసీ సొరంగం పనులను తిరిగి త్వరగా ప్రారంభించాలని అధికారులను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిఆదేశించారు. అవసరమైన అనుమతులపై త్వరలో సీఎం రేవంత్రెడ్డి భేటీ నిర్వహిస్తారని చెప్పారు. శుక్రవారం నీటిపారుదశాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి సవిూక్ష నిర్వహించారు. మూడు దశాబ్దాల తర్వాత నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బదిలీలు జరుగుతున్నట్లు- చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం తర్వాత నిపుణుల కమిటీ సిఫార్సు లతో తిరిగి పనులు మొదలుపెట్టాలి. ముఖ్యమైన ప్రాజెక్టు 9 కి.విూ పనికే నిలిచిపోవడం దురదృష్టకరం అన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తి కానందున ఎత్తిపోతలకు ఏటా రూ.750 కోట్లు- ఖర్చవుతోంది. అత్యాధునిక సాంకేతికతతో ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్జీఆర్ఐ సర్వేతో భూగర్భం కి.విూ దిగువ వరకు మ్యాపింగ్ చేయొచ్చన్నారు. కచ్చితమైన ప్రణాళిక కోసం లైడార్ సర్వే కూడా చేస్తాం. నాణ్యతలో రాజీపడకుండా మంత్రివర్గం ఆమోదించిన అంచనాతో ప్రాజెక్టు పనులు చేపట్టాలని మంత్రి తెలిపారు. మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగానికి హెలికాప్టర్తో మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.2.36 కోట్లతో నామినేషన్ పద్ధతిన ఎన్జీఆర్ఐకి పనులు అప్పగించింది. ఎస్ఎల్బిసి సొరంగంలో జరిగిన ప్రమాదం తర్వాత అక్కడ పనులు ఆగిపోయాయి. దీంతో ఆ పనులను పునః ప్రారంభించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సొరంగంలో ప్రమాదం తర్వాత నిపుణుల కమిటీ- సిఫార్సులతో పనులు తిరిగి మొదలు పెట్టాలని ఉత్తమ్ అన్నారు. ముఖ్యమైన ప్రాజెక్టు 9 కి.మి పనికే ఆగిపోవడం దురదృష్టకరం. ఎస్ఎల్బిసి పూర్తి కాకపోవడంతో ఎత్తిపోతలకు రూ.750 కోట్లు- ఖర్చవుతోంది. అందుకే అత్యాధునిక సాంకేతికతతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగానికి హెలికాప్టర్తో మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.2.36 కోట్లతో నామినేషన్ పద్ధతిన ఎన్జీఆర్ఐకి పనులు అప్పగించింది.