ఎల్ ఓ సి లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1.5 లక్షల రూపాయల CMRF LOC  అందజేత

మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన Y. రంగమ్మ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కానీకుటుంబం ఆర్థికంగా వెనకబడి ఉండండం వలన  మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన తెరాసపార్టీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది . దీంతో  వెంటనే స్పందించినఎమ్మెల్యే గారు నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 1,50,00రూపాయల LOC లెటర్ మంజూరు చేయించి గురువారం రోజు  వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీనాయకులు,కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.