ఎవరిని రక్షించడానికి అశ్వనీకుమార్‌ రాజీనామా చేశారు?

భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ : యూపీఏ-2 కుంభకోణాల నిలయంగా మారిందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు. అవినీతిని నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎవరిని రక్షించడానికి అశ్వనీ కుమార్‌ రాజీనామా చేశారని ప్రశ్నించారు. పాలనలో వైఫల్యాలు వెలుగుచూస్తున్నా ప్రధాని నోరు మెదపడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుంభకోణాల మయంగా మారి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు.