ఎస్ఐ జగదీష్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

దంతాలపల్లి జులై 29 జనంసాక్షి
ఇటీవల  బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్ఐ  జగదీష్ ను శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోత్ భట్టునాయక్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా భట్టునాయక్ మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ నెమ్మది యాకయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎల్లు శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యక్షుడు గోనెల అనిల్,నాయకులు వాసు,శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area