ఎస్ఐ నుండి సిఐ లు గా పదోన్నతి పొందిన సి ఐ లను అభినందించిన జిల్లా ఎస్పీ కె నరసింహ

(మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి)

మహబూబ్ నగర్ జిల్లా లోని నలుగురు ఎస్ఐ లకు సిఐ లుగా పదోన్నతి పొందారు . ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ కె నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు . 2009 బ్యాచ్ కు చెందిన ముగ్గురికి , 2012 బ్యాచ్ కు చెందిన ఒక్కరికి మొత్తం నలుగురు ఎస్ఐ లకు ఇన్స్పెక్టర్ లు గా పదోన్నతి పొందినట్లు తెలిపారు . ప్రస్తుతం మహబూబ్ నగర్ విఆర్ లో ఎస్ఐ లు గా ఉన్న సైదయ్య , మోహన్ బాబు లతో పాటు , సి సి ఎస్ లో ఎస్ఐ లుగా ఉన్న రామకృష్ణ, , బాలకృష్ణ లకు సిఐ లుగా పదోన్నతి పొందారు . ఈ సందర్భంగా వారిని జిల్లా ఎస్పీ కె నరసింహ అభినందించారు .