ఏనుగును చంపి దంతాల చోరీ
డెహ్రాడూన్,సెప్టెంబర్18(జనంసాక్షి): ఉత్తరాఖండ్లో దారుణం జరిగింది. ఒక ఏనుగును హతమార్చి దాని దంతాలను చోరీ చేసిన ఉదంతం వెలుగు చూసింది. శివాలిక్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని కొందరు వేటగాళ్లు ఒక మగ ఏనుగును అంతమొందించి దాని దంతాలను చోరీ చేశారు. 45 ఏళ్ల ఏనుగును చంపి దాని దంతాలను ఎత్తుకుపోయిన ఘటనను డెహ్రాడూన్ అటవీశాఖ అధికారి ధర్మసింగ్ విూనా స్పష్టం చేశారు. ఈ ఉదంతంలో మృతి చెందిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నారు. 2001లో కూడా ఉత్తరాఖండ్ అటవీప్రాంతంలో ఇటువంటి వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి.