ఏ తప్పూ చేయలేదు : అశ్వనీకుమార్‌

న్యూఢిల్లీ : తాను ఏ తప్పూ చేయలేదని న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీ కుమార్‌ అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌ పార్టీ విధేయుడినని.. నిజాయితీ నిరూపించుకుంటానని చెప్పారు. నిన్న మంత్రి పదవికి అశ్వనీకుమార్‌ రాజీనామా చేసి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రాజీనామా లేఖను సమర్పించిన విషయం తెలిసిందే.