ఐదు రోజులకు చేరిన వీఆర్ఏల సమ్మె..

టేక్మా జనం సాక్షి జూలై 29 తమ సమస్యలు పరి ష్కరించాలని వీఆర్ఎలు చేపట్టిన రిలే నిరహార దీక్షలు శుక్రవారం నాటికి ఐదు రోజుకు చేరాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే వీఆర్ఎలకు పేస్కేల్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం  మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వీఆర్ఎల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమం లో వీఆర్ఎ లింగమయ్య, భూమయ్య, నిర్మల, సుమలత, హనుమంతు, వీరేశం, జనార్దన్ రెడ్డి, సునీత, లక్ష్మి, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.