ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రిమాండ్‌ పొడగింపు

హైదరాబాద్‌ :ఓఎంసీ,  కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌, శ్రీలక్ష్మీలకు న్యాయస్థానం ఈ నెల 18 వరకు రిమాండ్‌ పొడగించింది. గాలి సోదరులు, రాజగోపాల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించగా, శ్రీలక్ష్మీని చంచల్‌గూడ మహిళ జైలు సిబ్బంది సీబీఐ కోర్టులో హాజరుపరిచారు.  జగన్‌ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డి, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్‌ లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించి వారి రిమాండ్‌ను ఈ నెల 18 వరకు సీబీఐ కోర్టు పొడిగించింది.